మంత్రాంగం మొత్తం
మినరల్ వాటర్
మాత్రమె తాగుతారు
మంది కోసం పంపుల్లో
కాలకూటం పంచుతారు
నీటి కోసం డబ్బుకడితె
నీళ్లతోటె చంపుతారు
లక్షా, రెండూ ఐదంటూ
ప్రాణానికో రేటు కడతారు
ఐనా ఆయుర్దాయం లేకుంటే
అయ్యవారు ఏంచేస్తాడు
ఐనవాళ్లకు లాగానే
ఆత్మశాంతికి ప్రార్ధిస్తాడు
దేవుడి పాలనలో
రోజూనీళ్లొదులుతారు
నీతికి
న్యాయానికి మల్లే
ప్రజల ప్రాణాలకీ
కాసిని నువ్వులు కలిపి
నీళ్లొదులుతారు
2 స్పందనలు so far ↓
Satyanarayana // మే 7, 2009 వద్ద 10:28 అపరాహ్నం |
బాగుంది
రాకేశ్వర రావు // మే 19, 2009 వద్ద 5:44 అపరాహ్నం |
భూటాన్ లో …
స్వచ్ఛమైన నీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఎంత కావాలంటే అంతా దొరుకుతాయఁష.