నన్ను శ్రీ నన్ను “కీ. శే” అన్నారు జనము
ఈ (పారడి) కవిత మాచిరాజు దేవీప్రసాద్ గారిది.కవిత శీర్షిక( title) కూడా ఇదే.
అందరూ నన్ను పోయినవాడికింద జమకట్టారు అనటానికి కవి ఉపయోగించిన మంచి అభివ్యక్తి “నన్ను శ్రీ నన్ను “కీ. శే” అన్నారు జనము”.ఈ కవిత లో కవి కి జ్వరం వచ్చి మంచానపడితె అందరూ పొతాడు అనేఅనుకుంటున్నారుట:
వూరు వూరెల్ల హా యన్చు హొరు మన్చు
వగరిన్చి నాపైన్ ఆసవదిలినారు
నిలిపినిలిపొక్కబొట్టు కన్నిరురాల్చి
నన్ను..శ్రీ నన్ను “కీ. శే” అన్నారు జనము
ఎందుకొ ఈ కవిత సౌరవ్ గంగూలీ కి సరిగ్గా అతికి నట్టు సరిపోతుంది అనిపించింది నాకు.
ఒక పద్దతి ప్రకారం జట్టునుండి తొలగింపబడటం, తరువాత కొన్నాళ్ళు అసలు జట్టు ఎంపిక లో పరిగణింపపడకపోవటం, తన కన్న ఎక్కువసార్లు విఫలమైన వాళ్లని మాత్రమ్ ప్రతి టూర్ కి ‘మోసుకెళ్లటం’, అటు మీద మీడియా కధనాలు, కొద్ది మంది మిత్రులు, కుటుంబ సభ్యులు తప్ప .. వెన్నుతట్టేవారు లేకపోవటం చూసి, గంగూలీ కరక్ట్॑గా ఇదే అనుకునివుంటాడు ( బెంగాలిలోకి అనువదించుకొని)…
అయితే .. అట్లా అనుకొని ఆగిపోలెదు.. ఆ కవితలో ఎలా Anti-climax ఇచ్చడో కవి, గంగూలీ కూడ అంతే రసవత్తరమైన Anti-climax ఇచ్చాడు.
ఆకవిత లో డాక్ట్రుగారు మనవాడి నాడి పట్టుకొని పెదవి విరుస్తాడు, ( ఆయన పేరు చేపలా, రొయ్యలా అని అడగకండి , అది కవితలో లేదు)
..
మార్రొజు పొద్దున లేచి – కవి చెప్పిన వాక్కులివి:..
నేను చెక్కపేడల్లె యున్నాను బాబు
కాని చచ్చిపొయింది డాక్ట్రయ్యయేను
ఇప్పుడు మన టీం లొ ఎవరు రాజీనామ చేసారో, ఎవరు ఇంట్లో కూర్చొని గోళ్లు గిల్లు కుంటున్నారో చూస్తే .. ఈ చివరి పంక్తి కూడా ఇక్కడ కచ్చితంగా సరిపొతుంది. కాదంటారా?